AP NTR Pensions: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపుకు ఏపీ క్యాబినెట్ అమోదం, జూలై1న బకాయిలతో కలిపి చెల్లింపు-ap cabinet approves hike in pensions payment of arrears on july 1 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ntr Pensions: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపుకు ఏపీ క్యాబినెట్ అమోదం, జూలై1న బకాయిలతో కలిపి చెల్లింపు

AP NTR Pensions: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపుకు ఏపీ క్యాబినెట్ అమోదం, జూలై1న బకాయిలతో కలిపి చెల్లింపు

Sarath chandra.B HT Telugu

AP NTR Pensions: ఏపీలో పెన్షన్ మొత్తం పెంపుకు క్యాబినెట్ అమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సామాజిక పెన్షన్ల పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి సంతకం చేశారు.

ఏపీలో పెన్షనల్ పెంపుదలకు క్యాబినెట్ అమోద ముద్ర

AP NTR Pensions: ఏపీలో సామాజిక పెన్షన్లు అందుకుంటున్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది. జూలైలో కొత్త పెన్షన్లను పాత బాకీలతో కలిపి అందించాలనే నిర్ణయానికి క్యాబినెట్ అమోద ముద్ర వేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి రూ.7,000 పెన్షన్ అందించనున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా సామాజిక పెన్షన్లను రూ.4వేలకు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఫైల్‌పై తొలి సంతకం చేశారు.

జూలై 1వ తేదీ నుంచి పింఛన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. ఇప్పటికే పెన్షన్ల పెంపుదలపై విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి క్యాబినెట్‌లో అమోద ముద్ర వేశారు. సామాజిక పెన్షన్ల కింద ఇచ్చే మొత్తం రూ.3వేల నుంచి రూ.4లకు పెంచాలని నిర్ణయానికి తొలి క్యాబినెట్‌లో ఆమోదం తెలిపారు.

జులై 1 నుంచి పెంచిన పింఛన్లను ఇంటి వద్దే అందజేయాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత మూడునెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7వేల పింఛను అందనుంది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు ఈ మొత్తాలను పంపిణీ చేయనున్నారు. ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించిన బకాయిలతో కలిపి లబ్దిదారులకు పెన్షన్లను అందించనున్నారు.