ఏపీ టెన్త్ ఫలితాల్లో కాకినాడ విద్యార్థినికి 600/600 మార్కులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు-ap 10th results kakinada student gets 600 out of 600 marks govt school student gets 598 marks ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీ టెన్త్ ఫలితాల్లో కాకినాడ విద్యార్థినికి 600/600 మార్కులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు

ఏపీ టెన్త్ ఫలితాల్లో కాకినాడ విద్యార్థినికి 600/600 మార్కులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు

ఏపీ పదో తరగతి ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. పది ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. టెన్త్ ఫలితాల్లో కాకినాడకు చెందిన నేహాంజని అనే విద్యార్థిని 600/600 మార్కులు సాధించింది.

ఏపీ టెన్త్ ఫలితాల్లో కాకినాడ విద్యార్థినికి 600/600 మార్కులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. టెన్త్ ఫలితాల్లో కాకినాడకు చెందిన నేహాంజని అనే విద్యార్థిని 600/600 మార్కులు సాధించింది. ఈ బాలిక కాకినాడ నగరంలోని భాష్యం పాఠశాలలో చదువుతోంది. మరోవైపు ఎలమంచిలి శ్రీ చైతన్య స్కూల్‌లో చదువుతున్న ఎండ అనిత అనే విద్యార్థిని 599 మార్కులు సాధించింది. అలాగే పల్నాడు జిల్లా ఒప్పిచర్ల జిల్లా పరిషత్ హైస్కూల్ లో చదువుతున్న పావని చంద్రిక 598 మార్కులు సాధించింది. బాలికను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినుల ప్రతిభ

పావని చంద్రికకు 598/600 మార్కులు వచ్చాయి. హిందీ, ఇంగ్లీష్ లో 99 మార్కులు వచ్చాయి. అన్నమయ్య జిల్లా పెద్దవీడు, ప్రకాశం జిల్లా అలకూరపాడు జడ్పీ స్కూల్ విద్యార్థినులు మేఘ, వెంకట భార్గవికి 595 మార్కులు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అధిక మార్కులు రావడంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.

ఈ ఏడాది 6,14,459 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా, 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 81.14% ఉత్తీర్ణత సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో నిలిచింది. 1,680 పాఠశాలలు 100% ఫలితాలు సాధించాయి.

సప్లిమెంటరీ పరీక్షలు

పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించింది. మే 19వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని, మే 28వ తేదీతో ముగుస్తాయని పేర్కొంది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి పరీక్షల ఫీజు చెల్లించుకోవాలని… మే 1వ తేదీ వరకు గడువు ఉంటుందని తెలిపింది.

ముఖ్య తేదీలు

సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేస్తామని విద్యాశాఖ తెలిపింది. ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 30వ తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చని సూచించింది. రూ. 50 ఆలస్యం రుసుంతో అయితే మే 1వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొంది. bseaps.in వెబ్ సైట్ లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

ఏప్రిల్ 24 నుంచి

ఏపీ టెన్త్ పరీక్షల రీవాల్యుయేషన్ కోసం ఏప్రిల్ 24వ తేదీ నుంచి ఫీజులు చెల్లించుకునే వీలు ఉంది. మే 1 వరకు ఇందుకు అవకాశం ఉండగా, రీకౌంటింగ్ కోసం ప్రతి సబ్జెక్ట్ కు రూ. 500 చెల్లించాలి. రీవెరిఫికేషన్ కోసం అయితే ప్రతి సబ్జెక్ట్ కు రూ. 1000 చెల్లించాలి. సీఎఫ్ఎంఎస్ విధానంలోనే ఈ ఫీజులను చెల్లించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

ఈసారి విడుదలైన ఏపీ టెన్త్ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 93. 90 శాతంతో టాప్ ప్లేస్ లో నిలిచింది. 47.67 శాతం ఉత్తీర్ణతతో అల్లూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. పరీక్షలకు 6,14,459 మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 81.14 శాతం నమోదైనట్లు తెలిపింది. బాలుర ఉత్తీర్ణత శాతం 78.31గా ఉండగా… బాలికల ఉత్తీర్ణత శాతం 84.09గా ఉంది. బాలురతో పోల్చితే బాలికల ఉత్తీర్ణత 5.78 శాతం ఎక్కువగా ఉంది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం