Guntur : పేరుకే 'స్పా' సెంటర్లు.. లోపల థాయ్‌లాండ్‌ యువతులు.. అవాక్కైన పోలీసులు!-anti social activities in spa center with thailand women in guntur city ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Guntur : పేరుకే 'స్పా' సెంటర్లు.. లోపల థాయ్‌లాండ్‌ యువతులు.. అవాక్కైన పోలీసులు!

Guntur : పేరుకే 'స్పా' సెంటర్లు.. లోపల థాయ్‌లాండ్‌ యువతులు.. అవాక్కైన పోలీసులు!

Basani Shiva Kumar HT Telugu
Dec 07, 2024 11:10 AM IST

Guntur : ఈజీ మనీ కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ముఖ్యంగా స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నడిపిస్తున్నారు. గుంటూరు నగరంలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దందా వెనక రాజకీయ పార్టీల నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.

స్పా సెంటర్ల పేరుతో గలీజు పనులు
స్పా సెంటర్ల పేరుతో గలీజు పనులు (istockphoto)

గుంటూరు నగరంలో మరో కొత్త దందా వెలుగులోకి వచ్చింది. స్పా సెంటర్ల పేరుతో కొందరు గలీజు పనులు చేయిస్తున్నారు. మసాజ్ పేరుతో వ్యభిచారం నడిపిస్తున్నారు. తాజాగా పలు స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో పోలీసులకు ఆశ్చర్యకరమైన దృశ్యాలు కనిపించాయి. అటు ఈ వ్యవహారం వెనక రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి 8 ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

yearly horoscope entry point

1.గుంటూరు నగరంలోని స్పా సెంటర్లలో మసాజ్‌ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం జరుగుతోందని పోలీసులకు సమాచారం వచ్చింది.

2.స్పా సెంటర్లపై అనుమానాలు రావడంతో.. పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో పలు స్పా సెంటర్లలో థాయ్‌లాండ్‌‌కు చెందిన యువతులు పట్టుబడ్డారు.

3.పట్టాభిపురం, అరండల్‌పేట పోలీస్ స్టేషన్ల పరిధిలోని స్పా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే.. పోలీసుల దాడుల గురించి ముందే తెలుసుకున్న స్పా సెంటర్ల నిర్వాహాకులు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

4.లక్ష్మీపురంలోని తురా స్పా సెంటర్‌లో తనిఖీలు చేసిన పోలీసులు.. అక్కడి దృశ్యాలు చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. తురా స్పా సెంటర్‌లో ఏడుగురు మహిళలు, ముగ్గురు పురుషులు పట్టుబడ్డారు. వీరిలో నలుగురు థాయ్‌లాండ్‌కు చెందిన మహిళలు ఉన్నారు.

5.స్పా సెంటర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని యజమాని, మేనేజర్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించారు.

6.మరో స్పా సెంటర్‌లో పోలీసులు దాడి చేసిన సమయంలో నలుగురు థాయ్‌లాండ్‌, ముగ్గురు పురుషులు ఉన్నారు.

7.పలు స్పా సెంటర్లలో తనిఖీలు చేసిన పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలిసింది. అయితే.. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కేసులు నమోదు చేయలేదనే ప్రచారం జరుగుతోంది.

8.ఈ స్పా సెంటర్లలో గలీజు పనుల వెనక రాజకీయ పార్టీల నేతలు ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. వారి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్టు గుంటూరు కోడై కూస్తోంది.

Whats_app_banner