Annamayya Crime : బాలికపై అత్యాచారం చేసిన మృగాడు, నిందితుడిని రాళ్లతో కొట్టి చంపేసిన గ్రామస్థులు-annamayya district man brutally molested minor girl villagers beaten to death ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Annamayya District Man Brutally Molested Minor Girl Villagers Beaten To Death

Annamayya Crime : బాలికపై అత్యాచారం చేసిన మృగాడు, నిందితుడిని రాళ్లతో కొట్టి చంపేసిన గ్రామస్థులు

Bandaru Satyaprasad HT Telugu
May 21, 2023 10:16 PM IST

Annamayya Crime : 8వ తరగతి బాలికపై ఓ నీచుడు అతిదారుణంగా అత్యాచారం చేసి, కత్తితో దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు అతడిగా దాడి చేసి చంపేశారు.

బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిపై దాడి
బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిపై దాడి (File photo)

Annamayya Crime : ఎనిమిదో తరగతి బాలికపై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై కత్తితో బాలికపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో ఆ వ్యక్తిని రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన ముత్తన్న(43) అత్యాచారం చేశాడు. అనంతరం బాలికపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. తీవ్ర గాయాల పాలైన బాలిక ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉందని వైద్యులు తెలిపారు. బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువుతుంది. ఆదివారం సాయంత్రం గ్రామంలోని పొలాల్లో ఆవులను మేతకు తోలుకెళ్లగా ముత్తన్న ఈ దారుణానికి పాల్పడ్డాడు.

ట్రెండింగ్ వార్తలు

భార్యను చంపి ఏడేళ్లు జైలులో

బాలికపై ముత్తన్న అత్యాచారం చేశాడన్న విషయం తెలుసుకున్న గ్రామస్థులు నిందితుడిపై దాడి చేశారు. కర్రలు, రాళ్లతో తీవ్రంగా కొట్టడంతో ముత్తన్న అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ముత్తన్న గతంలో భార్యను హత్య చేసి ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించినట్లు గ్రామస్థులు తెలిపారు. రెండేళ్ల క్రితమే జైలు నుంచి విడుదలై వచ్చిన ముత్తన్న... తరచూ గ్రామంలో కత్తితో తిరుగుతూ గ్రామస్థులను బెదిరించేవాడని తెలుస్తోంది.

తెనాలిలో మరో దారుణం

తెనాలిలో దారుణ ఘటన జరిగింది. బాలికపై కామాంధుడు అత్యాచారం చేశాడు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో... మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు కొప్పుల రాజు. ఆ తర్వాత బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులు తెలియజేయడంతో, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు కొప్పుల రాజు(40)ను అదుపులోకి తీసుకున్నారు.

యూపీలో మైనర్ పై అఘాయిత్యం

ఉత్తర్ ప్రదేశ్​లో దారుణ ఘటన జరిగింది. స్కూల్​నుంచి తిరిగొస్తున్న 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. యూపీలోని మంజ్హాన్​పూర్​ ప్రాంతానికి చెందిన బాలిక గురువారం స్కూల్​కు వెళ్లింది. సాయంత్రం స్కూల్​ నుంచి తిరిగొస్తుండగా ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగింది. లిఫ్ట్ ఇచ్చిన అతడు...బాలికను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో మైనర్ స్పృహ కోల్పోయింది. ఈ దారుణం అనంతరం ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. స్పృహలోకి వచ్చిన బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

IPL_Entry_Point