ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద మూడు విడతల్లో ఏటా రూ.20 వేలు రైతులకు అందించనున్నారు. అయితే కౌలు రైతులు, అటవీ భూహక్కుదాలకూ అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతు కుటుంబానికి మూడు విడతల్లో రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6 వేలతో కలిపి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈ నెల 20లోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అటవీ భూములపై హక్కు కలిగిన(ఆర్ఎస్ఆర్) వారిని అర్హులుగా గుర్తించనున్నారు.
వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులతో పాటు తహసీల్దార్, మండల వ్యవ సాయాధికారులు తమ పరిధిలోని రైతుల వివరాలను అర్హుల జాబితాలను ఈనెల 20లోగా అన్నదాత సుఖీభవ వెబ్ సైట్ లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది.
అన్నదాత సుఖీభవ పథకం అమలుకు వ్యవసాయశాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది.
పీఎం కిసాన్ జాబితాపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మే నెలాఖరులోగా పీఎం కిసాన్ జాబితాలను సిద్ధం చేయనున్నారు. ఈ జాబితాల నుంచి చనిపోయిన వారి పేర్ల తొలగింపు, భూరికార్డులకు అనుగుణంగా లబ్దిదారుల పేర్ల నమోదు, రైతుల ఐడీ నంబర్లు, పెండింగ్ లో ఉన్న ఆధార్, ఈ-కేవైసీ వివరాలు సరిదిద్దనున్నారు.
అటవీ హక్కుల చట్టం, ఆదివాసీలు, గిరిజనులకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను సిద్ధంచేయనున్నారు.
సంబంధిత కథనం