ఏపీలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్- రేపటి నుంచి దరఖాస్తులు, మార్పుచేర్పులకూ అవకాశం-andhra pradesh ration card update new applications and corrections begin from may 7th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్- రేపటి నుంచి దరఖాస్తులు, మార్పుచేర్పులకూ అవకాశం

ఏపీలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్- రేపటి నుంచి దరఖాస్తులు, మార్పుచేర్పులకూ అవకాశం

రేషన్ కార్డుల దరఖాస్తులపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మే 7 నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులు, మార్పు చేర్పులు, చిరునామా మార్పులకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

ఏపీలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్- రేపటి నుంచి దరఖాస్తులు, మార్పుచేర్పులకూ అవకాశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు దరఖాస్తులపై బిగ్ అప్డేట్ ఇచ్చింది. రేపటి(మే 7) నుంచి రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల చేరిక-తీసివేత, మార్పు చేర్పులు, అడ్రస్ మార్పులు వంటివి చేసుకోవచ్చని తెలిపారు. అర్హత లేనివారు రేషన్ కార్డులు సరెండర్ చేయాలని మంత్రి నాదెండ్ల సూచించారు.

రేషన్ కార్డుల్లో మార్పులకు 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

94.40 శాతం ఈకేవైసీ పూర్తి

"94.4 శాతం రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేశాం. రాష్ట్రంలో 1 కోటి 44 లక్షల 21 వేల 223 రేషన్ కార్డులు ఉన్నాయి. ఐదేళ్ల లోపు చిన్నారులు, 80 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఈకేవైసీ నుంచి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మినహాయింపు ఇచ్చాం. వీల్లు 6.45 లక్షల మందికి ఈకేవైసీ మినహాయింపు లభించింది" - మంత్రి నాదెండ్ల మనోహర్

రేపటి నుంచి రేషన్ కార్డు సేవలు

"రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు సేవలను తిరిగి ప్రారంభిస్తున్నాం. కొత్త రైస్ కార్డు కోసం దరఖాస్తు, కుటుంబలో రైస్ కార్డు స్పిల్టింగ్, తొలగింపు, ముఖ్యంగా అడ్రస్ మార్పు సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మరణాలు ఉంటే కుటుంబ సభ్యుల పేర్లు తొలగించడానికి అవకాశం ఇస్తున్నాం. అర్హత లేని వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రైస్ కార్డులు సరెండర్ చేయవచ్చు. అలాగే వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిన వారికి రైస్ బదులు ఇతర సరకులు తీసుకునే వెసులుబాటు కల్పించనున్నాం"- మంత్రి నాదెండ్ల మనోహర్

స్మార్ట్ కార్డులు

"ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 3.28 లక్షల మంది రేషన్ కార్డుల్లో మార్పులకు దరఖాస్తులు చేసుకున్నారు. రేషన్ స్మార్ట్ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు, క్యూఆర్ కోడ్ ఉంటాయి. ప్రభుత్వ చిహ్నాలు మాత్రమే కార్డులో ఉంటాయి. రేషన్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే గత ఆరు నెలల్లో ఎక్కడ రేషన్ తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు, ఇతర వివరాలు తెలుస్తాయి. మార్పుచేర్పులు చేసుకుంటా ఆ వివరాలు సివిల్ సప్లైస్ డేటా బేస్ లో సులభంగా మారిపోతాయి" -మంత్రి నాదెండ్ల మనోహర్

వాట్సాప్ ద్వారా రేషన్ కార్డు సేవలు

"గ్రామ, వార్డు సచివాలయాల్లో రేపటి నుంచి రేషన్ కార్డు సేవలను నమోదు చేసుకోవచ్చు. వచ్చే వారం(మే 12) నుంచి వాట్సాప్ ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నాము. మే నెల మొత్తం కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు, మార్పు చేర్పులు చేసుకోవచ్చు. 4.25 కోట్ల మందికి రేషన్ కార్డులు అందించేందుకు జూన్ నెలలో చేపట్టనున్నాం. స్మార్ట్ కార్డులను జూన్ నుంచి జారీ చేస్తాం" -మంత్రి నాదెండ్ల

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఇప్పటి వరకూ 1.50 కోట్ల మంది దీపం కింద లబ్దిచేరుకుందని చెప్పారు. ఈ ఏడాది నుంచి పాఠశాలల 25 కేజీల ఫైన్ క్వాలిటీ రైస్ సరఫరా చేస్తామన్నారు.

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం