సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో వైఎస్ జగన్‌పై తదుపరి విచారణకు హైకోర్టు స్టే-andhra pradesh high court stays further proceedings against ys jagan in singaiah road accident case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో వైఎస్ జగన్‌పై తదుపరి విచారణకు హైకోర్టు స్టే

సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో వైఎస్ జగన్‌పై తదుపరి విచారణకు హైకోర్టు స్టే

HT Telugu Desk HT Telugu

రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి తో పాటు మిగిలిన వారిపై కూడా తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ హైకోర్టు

అమరావతి: సింగయ్య రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి తో పాటు మిగిలిన వారిపై కూడా తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ (FIR)ను రద్దు చేయాలని (క్వాష్) కోరుతూ వై.ఎస్. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం

వాదనలు, ప్రతివాదనలు ఇవీ

ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ (ఏజీ), కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం కావాలని కోరారు. అయితే, వై.ఎస్. జగన్ తరపు న్యాయవాది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, "ఆధారాలున్నా ఇంకా సమయం దేనికి?" అని ప్రశ్నించారు. ఏజీ కౌంటర్ దాఖలు చేయాలని అడగడంతో, హైకోర్టు "ఎఫ్‌ఐఆర్ సమాచారం సరిపోతుంది కదా?" అని ఏజీని ప్రశ్నించింది.

వై.ఎస్. జగన్ తరపు న్యాయవాది వాదనలు వినాల్సిన అవసరం లేదని ఏజీ కోర్టుకు విన్నవించారు. దీనికి వై.ఎస్. జగన్ తరపు న్యాయవాది స్పందిస్తూ, తమ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరారు.

కేసు వివరాలు, సాంకేతిక అంశాలు:

ఈ కేసులో ఒక కీలక అంశాన్ని వై.ఎస్. జగన్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. "సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత వీడియోను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియోను డౌన్‌లోడ్ చేశామని ఎస్‌ఐ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో ఏదైనా సృష్టించగలిగే అవకాశం ఉన్న ఈ రోజుల్లో, ఇలాంటి వీడియోల ప్రామాణికతను పరిగణనలోకి తీసుకోవాలి" అని ఆయన వాదించారు. ఈ వాదన వీడియో ఆధారంగా నమోదైన కేసులో సాంకేతిక, న్యాయపరమైన సవాళ్లను లేవనెత్తింది.

తదుపరి విచారణ వాయిదా:

క్వాష్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి, ఏజీ కౌంటర్ దాఖలు చేయడానికి వీలుగా, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.