AP New VCs : ఆంధ్రప్రదేశ్ లోని పలు యూనివర్సిటీలకు వైఎస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటీఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్ నియమితులయ్యారు. రాజశేఖర్ ప్రస్తుతం ఐఐటీ ఖరగ్పూర్లో మ్యాథ్స్ ప్రొఫెసర్ గా చేస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ సీఎస్ఆర్కె ప్రసాద్ను నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం వరంగల్ నిట్లో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
యోగి వేమన యూనివర్సిటీకి వీసీగా ప్రొఫెసర్గా పి.ప్రకాశ్బాబును నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బయో టెక్నాలజీ సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వీరంతా మూడేళ్ల పాటు ఆయా వర్సిటీలకు వీసీలుగా పనిచేయనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీకి వైఎస్ ఛాన్సలర్ ను నియమించింది. వైస్ ఛాన్సలర్ గా టి.కిషన్ కుమార్ రెడ్డిని నియమించింది. కిషన్ కుమార్ రెడ్డిని వీసీగా నియమిస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్టీయూ వీసీగా కిషన్ కుమార్ రెడ్డి మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. గతేడాది మే 21న వర్సిటీ వీసీ పోస్టును భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినా సాంకేతిక కారణాల రీత్యా ఈ ప్రక్రియ వాయిదా పడింది.
సంబంధిత కథనం