TTD : టీటీడీలో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు- సీబీ సీఐడీతో దర్యాప్తు చేయించాలని టీడీపీ ఫిర్యాదు-amaravati tdp complaints to cs on ttd ex eo dharma reddy bhumana karunakar reddy irregularities ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd : టీటీడీలో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు- సీబీ సీఐడీతో దర్యాప్తు చేయించాలని టీడీపీ ఫిర్యాదు

TTD : టీటీడీలో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు- సీబీ సీఐడీతో దర్యాప్తు చేయించాలని టీడీపీ ఫిర్యాదు

Bandaru Satyaprasad HT Telugu
Updated Jul 08, 2024 07:04 PM IST

TDP On AV Dharma Reddy : టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని సీఎస్ కు టీడీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ లబ్ది చేకూర్చేందుకు ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి వ్యవహరించారని ఆరోపించారు.

టీటీడీలో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు- టీడీపీ
టీటీడీలో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు- టీడీపీ

TDP On AV Dharma Reddy : టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలపై సీఎస్ నీరభ్ కుమార్‌కు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. వైసీపీకి లబ్ది చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు తెగబడ్డారని, సంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకున్నారని, వారిపై సీబీ సీఐడీ లేదా విజిలెన్స్ శాఖతో విచారణ జరిపి అక్రమాలను వెలికి తీయాలని కోరారు.

లేఖలో ముఖ్యాంశాలు

"వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే సంప్రదాయానికి విరుద్ధంగా ఐఏఎస్ అధికారికి కాకుండా ధర్మారెడ్డిని JEOగా తరువాత EOగా జగన్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకునే బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో తనకున్న పరిచయాలను దుర్వినియోగం చేస్తూ ఎన్నికల సమయంలో వైసీపీకి విరాళాల సేకరణకు ధర్మారెడ్డి ప్రయత్నించారు. తిరుమలలో గెస్ట్ హౌస్‌లకు కేటాయించే భూముల్లో కూడా ధర్మారెడ్డి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పాటించలేదు. ఫర్నిచర్ల మార్పు పేరుతో కోట్ల రూపాయిలు పక్కదారి పట్టించారు. భక్తులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నా.... జగన్ పై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసులు, వైసీపీ రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టేందుకు ధర్మారెడ్డి దిల్లీకి తరచూ వెళ్తుండేవారు. ధర్మారెడ్డి మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తే క్రిమినల్ కేసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కాపాడేందుకు దిల్లీలో ఆయన రాజకీయ ప్రమేయం స్పష్టంగా తేటతెల్లమవుతాయి. 2 కోట్లు విలువైన డైమెండ్ వాచ్‌ను హైకోర్టు జడ్జికి ఆఫర్ చేశారనే వదంతులు కూడా ధర్మారెడ్డిపై ఉన్నాయి"

"మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఇద్దరూ బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా సివిల్ కాంట్రాక్టులకు టీటీడీ నిధులను పక్కదారి పట్టించారు. బడ్జెట్ పరిమితిని అధిగమించి మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రూ. 475 కోట్లకు పెంచగా.. అనంతరం ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన కరుణాకర్ రెడ్డి భారీగా రూ.1,772 కోట్లకు బడ్జెట్ పెంచి తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్నికల్లో భూమన అభినయ్ రెడ్డికి లబ్ది చేకూర్చేందుకు టీటీడీలో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి అక్రమాలు తెగబడ్డారు. శ్రీవాణి టికెట్ల పేరుతో రూ.10,500 వసూలు చేసి ఆ డబ్బులు ఏ రకంగా ఖర్చు చేశారో చూపించలేదు. ఎవరు టీటీడీకి విరాళాలు ఇచ్చినా అవి శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్‌లోకి జమవ్వడంతో టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే ఏ పని అయినా చేసుకునేలా అవకాశం కల్పించారు. పద్మావతి ఆసుపత్రి(రూ.550 కోట్లు), బాలాజీ ఇన్స్ స్టిట్యూట్(రూ.324 కోట్లు), స్విమ్స్ కార్డియోన్యూరో బ్లాక్ నిర్మాణాల్లో కూడా భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఆసుపత్రుల నిర్మాణానికి రూ.1 కోటి నుంచి 1.5 కోట్లు విరాళం ఇచ్చే భక్తులకు 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు ఇచ్చి భారీ కుంభకోణానికి తెరలేపారు"

"రూ.200 కోట్లతో తిరుమలలో కర్ణాటక ప్రభుత్వ యాత్రా సముదాయం నిర్మాణం విషయంలో టీటీడీ కర్ణాటక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిర్మాణ పనులు చేపట్టడానికి అనుమతించాలని ఒత్తిడి తెచ్చింది. తిరుమలలో గెస్ట్ హౌస్‌ల నిర్మాణం, విరాళాల విషయంలో వ్యక్తిగత దాతల విషయంలో టీటీడీ పూర్తిగా భిన్నమైన పద్ధతిని అవలంబించింది. తిరుమల కాంప్లెక్స్ 5 నిర్మాణంలో రూ.98 కోట్లు కమిషన్ల రూపంలో పక్కదారి పట్టాయి. వైసీపీ బడా నాయకుల సిఫార్సు చేసిన వారినే టీటీడీలోని సలహాదారులను, ఉద్యోగులుగా ధర్మారెడ్డి నియమించారు. కాబట్టి ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలపై సీబీ సీఐడీ లేదా విజిలెన్స్ శాఖతో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి." అని టీడీపీ సీఎస్ ను కోరింది.

Whats_app_banner

సంబంధిత కథనం