ఆంధ్రప్రదేశ్ రాజధాని పనుల పున: ప్రారంభోత్సవానికి ముహుర్తం సమీపిస్తుండంటంతో అతిథులకు ఆహ్వాన పత్రికలను జిఏడి సిద్ధం చేసింది. అమరావతి ప్రజా రాజధాని పున: ప్రారంభం ఆహ్వాన పత్రికలను రెడీ చేశారు.
అమరావతి నగర నిర్మాణ పనుల్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో ఆహ్వాన పత్రికల్ని ప్రభుత్వం అతిథులకు పంపుతోంది. అమరావతి ప్రజారాజధాని పున: ప్రారంభం పేరుతో వీటిని రెడీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్లతో వీటిని రూపొందించారు. ఆహ్వాన పత్రికలపై అమరావతి స్థూపంతో పాటు అమరావతి డిజైన్లతో రూపొందించారు.
ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభంతో పాటు మే 2వ తేదీన ఏపీకి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
మే 2న కేరళలోని తిరువనం తపురం విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రధాని బయలుదేరుతారు. 2.50 గంటలకు విజయవాడ విమానాశ్రయం చేరుకుం టారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా అమరావతికి చేరుకుంటారు.
సచివాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్ నుంచి 3.30 గంటలకు వేదిక వద్దకు వస్తారు. సాయంత్రం 4.45 గంటల వరకు వివిధ కార్యక్ర మాల్లో పాల్గొంటారు. మొత్తంగా ప్రధాని పర్యటన గంట 15 నిమిషాల పాటు ఉంటుంది. అనంతరం ఆయన విజయవాడ విమానాశ్రయం చేరు కుని, సాయంత్రం 5.20 గంటలకు ఢిల్లీకి ప్రయాణమవుతారు.
ప్రధాని పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. సభా వేదిక,పార్కింగ్ ప్రాంతాలు,వేదిక వద్దకు చేరుకునే మార్గాలు పరిశీంచారు. సింగపూర్ సహకారంతో మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు వివరించారు.
అమరావతిలో 365 కిమీ ట్రంక్ రోడ్లు, లే ఔట్ రోడ్లు 1500 కి,మీ మేర నిర్మించేలా ప్లాన్ ఉందని, గతంలోనే రూ.41 వేల కోట్లకు పనులు ప్రారంభం అయ్యాయని, 2019 కు ముందు రూ. 5 వేల కోట్ల బిల్లులు కూడా చెల్లించినట్టు చెప్పారు. గత ప్రభుత్వం రాజధానిపై మూడు ముక్కలాట ఆడిందని, మళ్ళీ తమ ప్రభుత్వం రాగానే అమరావతి పనులు ప్రారంభించినట్టు వివరించారు.
గత ప్రభుత్వం కాంట్రాక్టర్ల అగ్రిమెంట్ లు క్లోజ్ చేయలేదని, రివర్స్ టెండరింగ్,జ్యుడిషియల్ ప్రివ్యూ తీసుకొచ్చిందని, న్యాయపరమైన సమస్యలు లేకుండా ముందుకెళ్లేందుకు ఇంత సమయం పట్టిందన్నారు. రూ. 43 వేల కోట్ల పనులను ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తారని, అమరావతి రాజధాని పునఃప్రారంభం ప్రధాని చేస్తారని నారాయణ చెప్పారు.
మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తామ్నారు. 29 గ్రామాల రైతులను ప్రధాని సభకు రావాలని సీఎం స్వయంగా ఆహ్వానించారని, అమరావతిపై పార్లమెంట్ లో చట్టం చేయాలని రైతులు అడిగారని, చట్టబద్ధత అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారని చెప్పారు.
సంబంధిత కథనం