AP TS BJP Candidates : రఘురామకృష్ణరాజుకు నో ఛాన్స్, ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే- టీఎస్ లో ఇద్దరి పేర్లు ఖరారు
AP TS BJP Candidates List : బీజేపీ ఐదో జాబితాలో ఏపీ, తెలంగాణ లోక్ సభస్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసింది. ఏపీలో బీజేపీ పోటీ చేసే మొత్తం ఆరు స్థానాలకు, తెలంగాణలో మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
AP TS BJP Candidates List : బీజేపీ లోక్ సభ అభ్యర్థుల ఐదో జాబితాను(BJP Fifth List) విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 111 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయింది. ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాల్లో(AP BJP Candidates) పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో 6 ఎంపీ అభ్యర్థులను బీజేపీ ఐదో జాబితాలో ప్రకటించింది. అయితే నర్సాపురం టికెట్ ఆశించిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాశ ఎదురైంది. ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించింది. నర్సాపురం టికెట్ ను భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించింది. ఇప్పటికే తెలంగాణలో 15 మందికి సీట్లు ఖరారు చేసిన బీజేపీ(TS BJP Candidates) తాజాగా మరో రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. వరంగల్ (ఎస్సీ) స్థానానికి ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆరూరి రమేశ్ కు, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్రావును సీటు కేటాయించింది.
ఏపీలో 10 అసెంబ్లీ స్థానాలకు సోమవారం(మార్చి 25న) బీజేపీ అభ్యర్థులను ప్రకటించనుందని సమాచారం. పొత్తులో భాగంగా బీజేపీ ఏపీలో 10 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. ఎంపీ రఘురామకృష్ణరాజు తనకు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు కుట్ర చేసి తనకు టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు.
ఏపీ లోక్సభ అభ్యర్థులు(BJP Lok Sabha Candidates) వీళ్లే
- అరకు(ఎస్టీ- కొత్తపల్లి గీత
- అనకాపల్లి - సీఎం రమేష్
- రాజమండ్రి- పురందేశ్వరి
- నర్సాపురం- భూపతిరాజు శ్రీనివాస వర్మ
- తిరుపతి (ఎస్సీ) - వరప్రసాదరావు
- రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి
తెలంగాణ లోక్ సభ అభ్యర్థులు
- వరంగల్(ఎస్సీ)- ఆరూరి రమేశ్
- ఖమ్మం- తాండ్ర వినోద్ రావు
బీజేపీ గత జాబితాలో తెలంగాణ నుంచి 15 మంది అభ్యర్థులను(TS BJP Candidates) ఖరారు చేసిన విషయం తెలిసిందే.
- సికింద్రాబాద్- కిషన్ రెడ్డి
- కరీంనగర్-బండి సంజయ్
- నిజామాబాద్-ధర్మపురి అర్వింద్
- చేవెళ్ల-కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- భువనగిరి-బూర నర్సయ్య గౌడ్
- నాగర్ కర్నూల్-పి.భరత్
- జహీరాబాద్-బీబీ పాటిల్
- హైదరాబాద్-కె.మాధవీలత
- మల్కాజిగిరి-ఈటల రాజేందర్
- ఆదిలాబాద్(ఎస్సీ)-గోడం నగేష్
- పెద్దపల్లి(ఎస్టీ)-గోమాస శ్రీనివాస్
- మెదక్-రఘునందన్ రావు
- మహబూబ్ నగర్-డీకే అరుణ
- నల్గొండ-సైదా రెడ్డి
- మహబూబాబాద్-అజ్మీరా సీతారాం నాయక్
బీజేపీ ఐదో జాబితా(BJP Fifth List)లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు బిహార్, గుజరాత్, గోవా, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కేరళ, కర్ణాటక మహారాష్ట్ర, ఒడిశా, మిజోరాం, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమ బంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి మొత్తం 111 అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటి వరకు మొత్తం 402 మంది లోక్ సభ అభ్యర్థులని(BJP Lok Sabha Candidates) బీజేపీ ప్రకటించింది. తొలి జాబితాలో 195 మంది, రెండో జాబితాలో 72 మంది, మూడో జాబితాలో 9 మంది, నాలుగో జాబితాలో 15 మంది, ఐదో జాబితాలో 111 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది.
సంబంధిత కథనం