ప్రయాణికులకు అలర్ట్‌.. చర్లపల్లి-కాకినాడ, చర్లపల్లి-నర్సాపూర్‌ మధ్య 36 ప్రత్యేక రైళ్లు పొడిగింపు-alert for passengers cherlapalli kakinada cherlapalli narsapur special trains extended ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ప్రయాణికులకు అలర్ట్‌.. చర్లపల్లి-కాకినాడ, చర్లపల్లి-నర్సాపూర్‌ మధ్య 36 ప్రత్యేక రైళ్లు పొడిగింపు

ప్రయాణికులకు అలర్ట్‌.. చర్లపల్లి-కాకినాడ, చర్లపల్లి-నర్సాపూర్‌ మధ్య 36 ప్రత్యేక రైళ్లు పొడిగింపు

Sarath Chandra.B HT Telugu

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు 36 ప్రత్యేక రైళ్లను కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. చర్లపల్లి - కాకినాడ టౌన్‌, చర్లపల్లి-నర్సాపూర్‌ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

సమ్మర్ ప్రత్యేక రైళ్లు (twitter)

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు 36 ప్రత్యేక రైళ్లను కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. చర్లపల్లి - కాకినాడ టౌన్‌, చర్లపల్లి-నర్సాపూర్‌ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

వేసవి ప్రయాణికుల రద్దీని నియంత్రణ కోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు ప్రత్యేక రైళ్లను కొనసాగిస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.

చర్లపల్లి- కాకినాడ టౌన్‌, చర్లపల్లి - నర్సాపూర్‌ మధ్య 36 ప్రత్యేక రైళ్లను మే 2వ తేదీ నుంచి జూన్‌ 29 మధ్య కాలంలో నడుపుతారు. ప్రయాణికులకు ఈ రైళ్లను వినియోగించుకోవాలని సూచించారు.

ట్రైన్‌ నంబర్‌ 07031 చర్లపల్లి కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు మే 2వ తేదీ నుంచి జూన్‌ 27 వరకు 9 సర్వీసుల్ని నడుపుతారు. ఈ రైలు సాయంత్రం 7.20కు చర్లపల్లిలో బయల్దేరి మర్నాడు ఉదయం 4.30కు కాకినాడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్‌ నంబర్‌ 07032 కాకినాడ టౌన్‌ - చర్లపల్లి ప్రత్యేక రైలు సాయంత్రం 6.55కు బయల్దేరి మర్నాడు ఉదయం 5.50కు చర్లపల్లి చేరుతుంది. ఈ రైళ్లు మే 4 నుంచి జూన్‌ 29వరకు నడుస్తాయి.

ట్రైన్‌ నంబర్‌ 07031/07032 చర్లపల్లి-కాకినాడ టౌన్-చర్లపల్లి ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల మీదుగా రెండు వైపులా ప్రయాణిస్తుంది. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.

ట్రైన్‌ నంబర్ 07233 చర్లపల్లి - నర్సాపూర్‌ రైలు సాయంత్రం 7.15కు బయల్దేరి ఉదయం 5.50కు నర్సాపూర్ చేరుతుంది. ఈ ప్రత్యేక రైలును మే 2వ తేదీ నుంచి జూన్‌ 27 వరకు 9 సర్వీసుల్ని నడుపుతారు. తిరుగు ప్రయాణంలో నర్సాపూర్‌లో రాత్రి 8 గంటలకు బయల్దేరి ఉదయం 8కు చర్లపల్లి చేరుతుంది. మే 4 నుంచి జూన్‌ 29 వరకు 9 సర్వీసులు నడుపుతారు.

ట్రైన్‌ నంబర్‌ 07233/07234 చర్లపల్లి-నర్సాపూర్‌-చర్లపల్లి ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడిగూడె, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్‌, వీరవాసమం, పాలకొల్లు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం