దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు 36 ప్రత్యేక రైళ్లను కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. చర్లపల్లి - కాకినాడ టౌన్, చర్లపల్లి-నర్సాపూర్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.
వేసవి ప్రయాణికుల రద్దీని నియంత్రణ కోసం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు ప్రత్యేక రైళ్లను కొనసాగిస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.
చర్లపల్లి- కాకినాడ టౌన్, చర్లపల్లి - నర్సాపూర్ మధ్య 36 ప్రత్యేక రైళ్లను మే 2వ తేదీ నుంచి జూన్ 29 మధ్య కాలంలో నడుపుతారు. ప్రయాణికులకు ఈ రైళ్లను వినియోగించుకోవాలని సూచించారు.
ట్రైన్ నంబర్ 07031 చర్లపల్లి కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు మే 2వ తేదీ నుంచి జూన్ 27 వరకు 9 సర్వీసుల్ని నడుపుతారు. ఈ రైలు సాయంత్రం 7.20కు చర్లపల్లిలో బయల్దేరి మర్నాడు ఉదయం 4.30కు కాకినాడ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబర్ 07032 కాకినాడ టౌన్ - చర్లపల్లి ప్రత్యేక రైలు సాయంత్రం 6.55కు బయల్దేరి మర్నాడు ఉదయం 5.50కు చర్లపల్లి చేరుతుంది. ఈ రైళ్లు మే 4 నుంచి జూన్ 29వరకు నడుస్తాయి.
ట్రైన్ నంబర్ 07031/07032 చర్లపల్లి-కాకినాడ టౌన్-చర్లపల్లి ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్ల మీదుగా రెండు వైపులా ప్రయాణిస్తుంది. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.
ట్రైన్ నంబర్ 07233 చర్లపల్లి - నర్సాపూర్ రైలు సాయంత్రం 7.15కు బయల్దేరి ఉదయం 5.50కు నర్సాపూర్ చేరుతుంది. ఈ ప్రత్యేక రైలును మే 2వ తేదీ నుంచి జూన్ 27 వరకు 9 సర్వీసుల్ని నడుపుతారు. తిరుగు ప్రయాణంలో నర్సాపూర్లో రాత్రి 8 గంటలకు బయల్దేరి ఉదయం 8కు చర్లపల్లి చేరుతుంది. మే 4 నుంచి జూన్ 29 వరకు 9 సర్వీసులు నడుపుతారు.
ట్రైన్ నంబర్ 07233/07234 చర్లపల్లి-నర్సాపూర్-చర్లపల్లి ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడిగూడె, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసమం, పాలకొల్లు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.
సంబంధిత కథనం