Visakha to Bangkok: రూ.5వేలకే విశాఖ టూ బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌ జర్నీ,23వరకు ఎయిర్ ఏసియా ఆఫర్-air asia offers visakhapatnam to bangkok kuala lumpur journey for just rs 5 000 up to 23 days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha To Bangkok: రూ.5వేలకే విశాఖ టూ బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌ జర్నీ,23వరకు ఎయిర్ ఏసియా ఆఫర్

Visakha to Bangkok: రూ.5వేలకే విశాఖ టూ బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌ జర్నీ,23వరకు ఎయిర్ ఏసియా ఆఫర్

Sarath Chandra.B HT Telugu
Published Feb 17, 2025 09:00 AM IST

Visakha to Bangkok: విశాఖపట్నం నుంచి బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌ వెళ్లే వారికి ఎయిర్ ఏసియా ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. నిర్దేశిత వ్యవధిలో రూ.5వేలకే బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌ ప్రయాణించేందుకు టిక్కెట్లనుఅందిస్తోంది. విశాఖ నుంచి ఈ ఏడాది జూలై 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 15లోపు ప్రయాణించేలా ఆఫర్‌ ఉంది.

విశాఖ నుంచి రూ.5వేల బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌ జర్నీ
విశాఖ నుంచి రూ.5వేల బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌ జర్నీ (AP)

Visakha to Bangkok:  విశాఖ నుంచి బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌కు కారు చౌకగా ప్రయాణించే ఆఫర్‌ను ఎయిర్‌ ఏసియా ప్రకటించింది.  విశాఖ నుంచి బ్యాంకాక్‌, కౌలాలంపూర్‌ వెళ్లే వారికోసం స్పెషల్ ఆఫర్‌ అందుబాటులోకి వచ్చింది. 

జీరో బేస్ ఫేర్ ఆఫర్‌తో  విశాఖప ట్నం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్‌ తో పాటు తిరుచిరాపల్లి నుంచి బ్యాంకాక్‌ ప్రయాణాలకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.  2025 ఫిబ్రవరి 15 నుంచి 23వ తేదీ మధ్య చేసుకున్న బుకింగ్‌లకు ఈ ఆఫర్ చెల్లుబాటులో ఉంటుంది. 

ఈ ఏడాది జూలై 1 నుంచి 2026 జూన్ 15 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. తమకు అనువైన తేదీల్లో బుక్‌ చేసుకోవచ్చు.   అయితే టిక్కెట్లను మాత్రం ఈ నెల 23వ తేదీలోపు  బుక్ చేసుకోవాలని ఎయిర్ ఏసియా సూచించింది. 

విశాఖపట్నం  నుంచి బ్యాంకాక్ కౌలాలంపూర్‌ వెళ్లేందుకు రూ.7,500 నుంచి రూ.12 వేల వరకు టికెట్ ధర ఉంటుంది.  తాజా ఆఫర్‌లో పర్యాటకులు రూ.4,400 నుంచి రూ.5వేల ఖర్చులోనే ఒకవైపు  టికెట్ ధర ఉంటుందని ఎయిర్ ఏసియా ప్రకటించింది.  అన్ని వర్గాల ప్రయాణికులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈ ఆఫర్ ప్రకటించినట్లు ఎయిర్‌ ఏసియా ప్రకటించింది. 

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner