తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో అప్డేట్ ఇచ్చింది. శ్రీవారికి ఏడాది పూర్తి నిర్వహించే 450 పై చిలుకు ఉత్సవాలలో 25 రోజుల పాటు నిర్వహించే అత్యంత సుదీర్ఘమైన అధ్యయనోత్సవాలపై ప్రకటన చేసింది. ఈ ఏడాది డిసెంబరు 30 నుంచి తిరుమలలో ఘనంగా జరపనున్నట్లు తెలిపింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2025 జనవరి 10 నుంచి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 19వ తేదీ వరకు ఈ దర్శనాలు ఉంటాయని టీటీడీ తెలిపింది. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు ప్రారంభం సందర్భంగా… జనవరి 7వతేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
సంబంధిత కథనం