Adani Gyan Jyoti Scholarship : అదానీ సంస్థ 2024-25 విద్యాసంవత్సరానికి పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందిస్తోంది. అదానీ జ్ఞాన్ జ్యోతి స్కాలర్షిప్ పేరిట ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల విద్యార్థులకు ఏడాదికి రూ.3,50,000 వరకు స్కాలర్ షిప్ అందిస్తుంది. బీఏ ఎకనామిక్స్, బీఎస్సీ ఎకనామిక్స్, బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్, బీఈ, బీటెక్, 5-ఇయర్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఎంటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ కోర్సులు చదివే మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ నకు అర్హులు. ఈ స్కాలర్ షిప్ నకు ఎంపికైన విద్యార్థులు ఏడాదికి రూ.3,50,000 వరకు ఆర్థిక సాయం పొందవచ్చు. అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఈ రాష్ట్రాల విద్యార్థులు భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా చదువుకుంటున్నా వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా వృత్తిపరమైన ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సు, బీఈ/బీటెక్ లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఎంటెక్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యి ఉండాలి. విద్యార్థులు 2023 తర్వాత హయ్యర్ సెకండరీ/ప్రీ యూనివర్శిటీ/ఇంటర్మీడియట్/CBSE/ISC లేదా సమానమైన బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. రాష్ట్ర లేదా జాతీయ స్థాయి నిర్వహించిన అడ్మిషన్ పరీక్షలలో సాధించిన మెరిట్ ర్యాంక్ ఆధారంగా కోర్సులో జాయిన్ అయ్యి ఉండాలి.
విద్యార్థులు తప్పనిసరిగా జేఈఈ ఆల్ ఇండియా లెవల్ లో 40,000 లోపు ర్యాంక్ని పొంది ఉండాలి. స్కాలర్ కు దరఖాస్తు చేసుకునే విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.4,50,000 మించకూడదు. అదానీ గ్రూప్ ఉద్యోగుల పిల్లలు ఈ స్కాలర్ కు అర్హులు కాదు. బీఈ, బీటెక్, బీఆర్క్ డిప్లొమా కోర్సుల్లో లేటరల్ బెసిస్ చేరిన విద్యార్థులకు అర్హత లేదు. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ. 2,50,000 వరకు ట్యూషన్ ఫీజు స్కాలర్ షిప్ రూపంలో అందిస్తారు.
ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల అభ్యర్థులు అర్హులు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
దరఖాస్తుదారులు 2023 తర్వాత హయ్యర్ సెకండరీ/ప్రీ యూనివర్శిటీ/ఇంటర్మీడియట్/CBSE/ISC లేదా సమానమైన బోర్డు అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. రాష్ట్ర లేదా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలలో సాధించిన మెరిట్ ర్యాంక్ ఆధారంగా ఎంబీబీఎస్ సీటు పొంది ఉండాలి. నీట్ ఆల్ ఇండియా స్థాయిలో 15,000లోపు ర్యాంకు పొంది ఉండాలి. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 4,50,000 మించకూడదు. బీడీఎస్ విద్యార్థులు అర్హులు కాదు. అర్హులైన విద్యార్థులకు సంవత్సరానికి రూ.3,50,000 వరకు ట్యూషన్ ఫీజు అందిస్తారు.
సంబంధిత కథనం