తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో మహాపాతకం జరుగుతోందని.. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతామని.. తిరుమల పవిత్రత కాపాడటమే ధ్యేయం అని చంద్రబాబు, పవన్ చెప్పారన్నారు. కానీ గత మూడు మాసాలుగా గోశాలలో 100కుపైగా గోమాతలు మృత్యువాత పడుతుంటే.. ఆ విషయాన్ని దాచిపెట్టారని విమర్శించారు.
1.పవిత్ర పుణ్యక్షేతంలో టీటీడీ నడిపే గోశాలలో గోవుల దుస్థితి చూడండి. గోవులు ఎందుకు చనిపోతున్నాయో కూడా తెలియదు. టీటీడీ అధికారులు పర్యవేక్షణే లేదు. రాష్ట్ర అధినేతలకు ఊడిగం చేయడానికే కొందరు టీటీడీ అధికారులకు సమయం సరిపోతోంది.
2.శ్రీవేంకటేశ్వరునికే ఆహారాన్ని అందించిన తల్లి గోమాత. అలాంటి గోవు పట్లే ఈ ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది. స్వామి సుప్రభాత సేవలో నిత్యం ఆవు పాలతో చేసిన వెన్న నివేదిస్తారు. అలాంటి ప్రత్యేకత ఉన్న గోవులకు టీటీడీ సంరక్షణలో ఉన్న గోమాతకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంతా కాదు.
3.మా పాలనలో దాదాపు 550 నాణ్యమైన దేశీయ ఆవులను గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ నుండి దాతల ద్వారా సమీకరించి టీటీడీకి తెచ్చాం. స్వామివారి కైంకర్యాలకు ఈ ఆవుల పాలనే వినియోగించాం. వాటి సంరక్షణకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నాం. వాటి సంతానం దుస్థితి నేటి ప్రభుత్వంలో ఇలా ఉంది.
4.మా పాలనలో రోజుకు 1,500 లీటర్ల పాలు సమీకరించాం. నేడు 500 లీటర్లు కూడా గోశాల నుంచి కొండకు తరలి వెళ్లని దుస్థితి దాపురించింది. ఈ ప్రభుత్వంలో పర్యవేక్షణే కరువైంది. చెత్త వేసినట్టు గోమాతలకు గ్రాసాన్ని వేస్తున్నారు.
5.మా ప్రభుత్వ హయాంలోనే దాదాపు 2,000 ఆవులను ఈ టీటీడీ గోశాల నుండే, రైతుసాధికారిక సంస్థ ద్వారా రైతులకు పంపిణీ చేశాం. స్వామివారికి నవనీత సేవ ప్రారంభించాం. కూటమి పాలనలో గోమాతకు జరుగుతున్న ఘోరం పట్ల ప్రజలు ఉద్యమించాల్సిన, ఆగ్రహించాల్సిన అవసరం ఉంది. వందే గోమాతరం అనే సదస్సు నాడు వైఎస్సార్ హయాంలో జరిగింది.
6.స్వామివారికి అనునిత్యం దేశవాళీ ఆవుల నుంచి తయారైన నెయ్యి అందించేలా మా ప్రభుత్వ హయాంలో ఏర్పాట్లు చేశాం. దేశవాళీ ఆవుల పునరుత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఈ కూటమి ప్రభుత్వం దాన్ని అధ్వాన్నంగా వదిలేసింది.
7.బ్రీడింగ్ సిస్టం ద్వారా గోవులు పెంచి, గోఆధారిత పంటల ఉత్పత్తులను పెంచే కార్యక్రమం టీటీడీ ద్వారా చేయాలని సంకల్పించాం. ఎన్డీడీబీ ఛైర్మన్ను టీటీడీకి పిలిపించి ఈ ప్లాంట్ ఏర్పాట్లకు నిధులతో సహా సిద్ధం చేశాం. జగన్ మోహన్ రెడ్డి పాలన ధర్మవిఘాతం అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేశారు.
8.టీటీడీ గోశాలలో ఉన్న ఎంతో ప్రత్యేకమైన ముఖ్యమైన సాహీవాల్ ఆవు.. పైగా సూడిది గోశాల నుండి తప్పించుకుంది. చివరకు ఆ గోవు కడుపులో బిడ్డతో సహా రైల్వే ట్రాక్పై మరణించింది. టీటీడీ గోవుల చెవులకు ట్యాగ్లు ఉంటాయి. అది టీటీడికి చెందిన గోవు అని తెలియకుండా ఉండాలని చెవులు కత్తిరించేశారని తెలుస్తోంది.
9.టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. మృతి చెందిన గోవులు ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు. దురుద్దేశంతో కొద్ది మంది మృతి చెందిన గోవుల ఫొటోలను టీటీడీ గోశాలలో మృతి చెందినవిగా చూపించి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్న ప్రచారాన్ని టీటీడీ ఖండిస్తోంది. ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని నమ్మవద్దని.. టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
సంబంధిత కథనం