విశాఖ ఉక్కు కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం దన్నుగా నిలిచింది. ప్రైవేటీకరణ విషయాన్ని పక్కన పెడుతూ…. భారీ ఊతం ఇచ్చేలా ప్యాకేజీని ప్రకటించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో విశాఖ ఉక్కు కార్మాగారం నిర్వహణకు ఢోకా లేదన్న చర్చ వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
2021 ఏడాది నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం వాటాను అమ్మేసేందుకు సిద్ధమైంది. అప్పట్నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా ఆందోళనలు, నిరసలు కొనసాగుతున్నాయి. ఓవైపు కార్మికులతో పాటు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా తమవంతుగా పలు కార్యక్రమాలు నిర్వహించాయి. సందర్భాన్ని బట్టి కార్మికులకు ప్రత్యక్షంగానూ మద్దతు పలికాయి.
ఓవైపు కార్మికుల పోరాటంతో పాటు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందనే అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యక్తమవుతూ వచ్చాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీనే ఇందుకు బలమైన నిదర్శనమని చెప్పొచ్చు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి ఆర్థిక ప్యాకేజీ ప్రకటన వరకు ఏం జరిగిందో ఇక్కడ చూద్దాం…!
సంబంధిత కథనం