ఏపీలోని కూటమి ప్రభుత్వం… తల్లికి వందనం స్కీమ్ కు శ్రీకారం చుట్టింది. తల్లుల ఖాతాలోకి డబ్బుల జమపై ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అర్హులు, అనర్హుల జాబితాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అభ్యంతరాలను కూడా స్వీకరించేందుకు గడువును ప్రకటించింది.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ ను వర్తింపజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఈ స్కీమ్ కు గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను ఇక్కడ తెలుసుకోండి
సంబంధిత కథనం