'గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్'…. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి కారణమవుతున్న అంశం. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. జల హారతి కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన అన్నీ అనుమతులపై కూడా దృష్టి పెట్టింది.
ఇదిలా ఉంటే తెలంగాణ సర్కార్ ఈ ప్రాజెక్ట్ ను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తోంది. ఇటీవలనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఢిల్లీలో పర్యటించింది. కేంద్ర జలశక్తి మంత్రికి ప్రాజెక్ట్ కు ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా నిలవరించాలని కోరింది. మరోవైపు తెలంగాణలోని పలు రాజకీయ పక్షాలతో పాటు ఇతర సంఘాలు కూడా ఈ ప్రాజెక్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగకుండా అడ్డుకోవాలని సర్కార్ పై ఒత్తిడి తెచ్చే పనిలో ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ను ఏపీ సర్కార్ ఎందుకు నిర్మించాలనుకుంటోంది..? వివాదానికి గల కారణాలెంటో ఇక్కడ తెలుసుకోండి…..