TS Gurukulam : ఆగస్టు 1 నుంచి 22 వరకు గురుకుల నియామక పరీక్షలు - సమగ్ర షెడ్యూల్ విడుదల
18 June 2023, 6:15 IST
- TS Gurukul Recruitment 2023: గురుకుల ఉద్యోగ అభ్యర్థులకు మరో అప్డేట్ ఇచ్చింది రిక్రూట్ మెంట్ బోర్డు. ఆగస్టు 1వ తేదీ నుంచి నియామక పరీక్షలు నిర్వహిస్తుండగా… పూర్తి స్థాయి షెడ్యూల్ ను విడుదల చేసింది.

గురుకుల పోస్టుల భర్తీకి సమగ్ర షెడ్యూల్ జారీ
Telangana Gurukul Recruitment: తెలంగాణలోని గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల తేదీలు ఖరారైన సంగతి తెలిసిందే. ఆగస్టు 1 నుంచి 23 తేదీ వరకు గురుకుల నియామక పరీక్ష నిర్వహించనున్నారు. అయితే పోస్టుల భర్తీకి సమగ్ర రాతపరీక్షల షెడ్యూల్ను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షలన్నీ ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. మొత్తం 9 నోటిఫికేషన్ల ద్వారా... 9,210 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఆగస్టు 1 నుంచి 22 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు గురుకుల బోర్డు తెలిపింది.మొత్తం మూడు షిఫ్టులో ఉంటాయి. మొదటి షిఫ్టు పరీక్ష 8.30 నుంచి 10.30 గంటలు; రెండో షిఫ్టు పరీక్ష 12.30 నుంచి 2.30 గంటలు; మూడో షిఫ్టు పరీక్ష 4.30 నుంచి 6.30 గంటల వరకు ఉంటుంది. గురుకుల పోస్టులకు పేపర్ 1 పరీక్షలు అగస్టు 10, 11, 12 తేదీల్లో ఉంటాయి. ఇక ఆగస్టు 1 నుంచి 7 వరకు జేఎల్, డీఎల్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు.
గురుకులాల్లో బోధనా, బోధనేతర సిబ్బంది ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. 2.63లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. మే 27వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది.
గురుకులాల్లో భర్తీ చేసే పోస్టుల వివరాలు :
జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, పీడీ - 2008
డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్ - 868
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) -1276
ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) 4020
లైబ్రేరియన్ స్కూల్- 434
పీజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్ - 275
డ్రాయింగ్ టీచర్స్ ఆర్ట్ టీచర్స్ -134
క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ క్రాఫ్ట్ టీచర్స్- 92
మ్యూజిక్ టీచర్స్- 124
రాతపరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా(సీబీఆర్టీ)గా నిర్వహించనుంది గురుకుల రిక్రూట్ మెంట్ బోర్డు. రాష్ట్రంలో ఉద్యోగ నియామక పేపర్లు లీక్ కావటంతో… అలాంటి ఘటనలకు అవకాశం లేకుండా గట్టి చర్యలు చేపడుతోంది. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. వీలైనంత త్వరగా పరీక్షలు పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయాలని చూస్తోంది.