
Telangana News Live January 4, 2025: Rythu Bharosa : తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, రైతు భరోసాకి కింద ఏడాది రూ.12 వేలు
04 January 2025, 21:13 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Rythu Bharosa :తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా కింద ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ప్రకటించారు.
TG Govt On HMPV : చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభిస్తుంది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. హెచ్ఎంపీవీ కేసులపై తెలంగాణ ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఒక్క కేసు నమోదు కాలేదని వెల్లడించింది. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని, పలు సూచనలు చేసింది.
- KTR : కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణలో సీఎం అంటే ఇప్పుడు కటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణ ఏటీఎంగా మారిందని ఆరోపించారు.
CM Revanth Reddy : తెలంగాణపై పోలవరం ప్రాజెక్టు ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీమ్ తో అధ్యయనం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. ఏపీ బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎస్ కు తెలంగాణ అభ్యంతరాలను తెలపాలని సూచించారు.
Polytechnic College Incident : తెలంగాణలో మరో షాకింగ్ ఘటన జరిగింది. పాలిటెక్నిక్ కాలేజీలో బాలికల వాష్ రూమ్ లో మొబైల్ తో వీడియో రికార్డింగ్ చేసినట్లు విద్యార్థినులు గుర్తించారు. దీంతో విద్యార్థి సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగాయి.
- HYDRAA : హైడ్రో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కమిషనర్ రంగనాథ్ నేరుగా ప్రజలను కలవాలని డిసైడ్ అయ్యారు. అందుకు ముహూర్తం కూడా ఖరారు అయ్యింది. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. అటు హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
- IRCTC Hyderabad Shirdi Tour : కొత్త సంవత్సరం వేళ హైదరాబాద్ నుంచి షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది. నాలుగు రోజుల పాటు ట్రిప్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని IRCTC టూరిజం ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీ 10 జనవరి, 2025వ తేదీన అందుబాటులో ఉంది.
- వరంగల్ నగరంలో ఉండే సుబేదార్ బంగ్లాను హెరిటేజ్ బిల్డింగ్ గా డెవలప్ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. నిజాం కాలం నాటి ఈ నిర్మాణాన్ని… 1950 నుంచి ఇప్పటివరకు కలెక్టర్ ఆఫీస్ గా వాడారు. దాదాపు 57 మంది కలెక్టర్లు ఇదే బిల్డింగును క్యాంప్ ఆఫీస్ గా వినియోగించారు.
- యాదగిరిగుట్ట పరిధిలోని పెద్దకందుకూరులో భారీ పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు దాటికి… 8 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. .
- Telangana BJP : తెలంగాణ బీజేపీకి కొత్త సారథిని నియమించాలని పార్టీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో చాలామంది నేతలు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. వారిలో ఆరుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ.. ఓ నలుగురు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ నేతల ఒకరు చెప్పారు.
- Telangana Cabinet Meeting : ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో… కీలక అంశాలపై చర్చించనున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లతో పాటు మరిన్ని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
- తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక కోసం సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్న సర్వే టెక్నికల్ సమస్యతో 75 శాతం మాత్రమే సర్వే పూర్తయింది. దీంతో సంక్రాంతి తర్వాతే ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఉన్నప్పటికీ.. చేయలేని పరిస్థితిలో ఉన్నామని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనలపై స్పందించిన ఆయన. వారిని క్రమబద్ధీకరించే అవకాశం లేదని స్పష్టం చేశారు.
- Telangana Sankranti Holidays 2025 : తెలంగాణలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చేసింది. పాఠశాలలకు జనవరి 11 నుంచి హాల్ డేస్ రానున్నాయి. జనవరి 16వ తేదీతో ఈ సెలవులు ముగియనున్నాయి. ఈసారి మొత్తం ఆరు రోజులు సెలువులు ఉండనున్నాయి.