
Telangana News Live February 16, 2025: Jangaon Accident : జనగామ జిల్లాలో సిమెంట్ లారీ బీభత్సం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టి షాపుల్లోకి దూసుకెళ్లిన లారీ
Updated Feb 16, 2025 10:20 PM IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Jangaon Accident : జనగామ జిల్లా పాలకుర్తిలో సిమెంట్ లారీ బీభత్సం సృష్టించింది. సిమెంట్ లోడ్ తో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తు్న్న 10 మంది గాయపడ్డారు.
Kishan Reddy : సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీపై విమర్శలు చేయడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ డైరెక్షన్ లోనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఏదో ఒక వివాదం లేపుతున్నారన్నారు
Online Games : ఆన్ లైన్ గేమ్ లు ఇద్దరు యువకుల ప్రాణాలను బలిగొంది. వ్యసనంగా మారిన గేమ్ లతో అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు.
Hyderabad Water Cut: హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో 24 గంటల పాటు వాటర్ సప్లైకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ప్రకటించింది. ఈ నెల 17వ తేదీ ఉదయం 6 నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ సమయంలో నీటి సరఫరా నిలిపివేయనున్నారు.
Medchal Murder : మేడ్చల్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. చనిపోయిన వ్యక్తి కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన ఉమేశ్గా తెలుస్తోంది.
Jagtial News : జగిత్యాల జిల్లాలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకుంది. రెండ్రోజుల క్రితం మహిళ మృతి చెందగా, చికిత్స పొందుతూ ఆదివారం నాడు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారు. భర్త వేధింపులు, క్షణికావేళంతోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
- TG Caste Politics : గతంలో తెలంగాణ రాజకీయాల్లో కుల ప్రస్తావన పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఇటీవల రేవంత్.. మోదీ క్యాస్ట్ గురించి ప్రస్తావించారు. ఇది రాజకీయ దుమారానికి కారణమైంది. అసలు రేవంత్ మోదీ ప్రస్తావన ఎందుకు తెచ్చారు.
- TG AP Agriculture : కాలం మారుతోంది. సాంకేతిక పరిజ్ఞానం గ్రామాల వరకు విస్తరించింది. ముఖ్యంగా వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్తు వినియోగం పెరిగింది. దీనివల్ల రైతులకు ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- TG Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో హరీష్ రావు పేషీలో పనిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు వంశీకృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
- Sangareddy Crime : ఆ దంపతులు సేవాలాల్ దర్శనానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా రాత్రి అయ్యింది. ఓ విద్యా పీఠంలో తలదాచుకున్నారు. కానీ.. అక్కడే ఆ కామాంధుడు ఉంటాడని ఊహించలేదు. కళ్లముందే భార్యపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లాలో జరిగింది.