Telangana News Live December 11, 2024: Allu Arjun Petition : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు, హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ దాఖలు
11 December 2024, 20:55 IST
తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Allu Arjun Petition : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విషయంలో హీరో అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
UPSC Mains 2024 : యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం పొందిన వారిలో 20 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
Actor Mohanbabu : మంచు ఫ్యామిలీ వ్యవహారం, మీడియాపై దాడి కేసుల్లో సినీ నటుడు మంచు మోహన్ బాబుకు కాస్త ఊరట లభించింది. పోలీసుల విచారణ నుంచి మోహన్ బాబుకు హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
- మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం సూసైడ్ అటెంప్ట్ చేసిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వరంగల్ ఏంజీఏం వైద్యులు చెప్పారు. వరంగల్ ఎంజీఎం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు.
- మీడియా ప్రతినిధులపై దాడి ఘటనలో సినీ నటుడు మోహన్బాబుపై కేసు నమోదైంది. BNS 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు… పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- KCR daughter Kavitha : కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాలిటిక్స్ లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకున్నారు. అయితే కొద్దిరోజులుగా మళ్లీ రాజకీయం క్షేత్రంలోకి దిగారు. జాగృతితో పాటు పార్టీ నిరసన కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు.
- Bhadrachalam Online Tickets: భద్రాచలం రామాలయ ఉత్తర ద్వార దర్శనం ఆన్లైన్ టిక్కెట్లు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. జనవరి 10న భద్రాచలం రామాలయంలో ఉత్తర ద్వార దర్శనం పూజను నిర్వహిస్తారు. ఈ పూజల్లో 4వేల మందికి అవకాశం కల్పిస్తారు.
- Warangal Police: ఎంతో ఇష్టంగా బైకులు కొనుగోలు చేస్తున్న యువత.. వాటి సైలెన్సర్లు మార్చేస్తూ పెద్ద శబ్ధంతో దూసుకెళ్తున్నారు. జనాల చూపులు తమ వైపు తిప్పుకునేలా మెయిన్ రోడ్లపై సైలెన్సర్ షార్ట్స్, స్పార్క్స్ ఇస్తూ బైకులను రయ్యిమనిస్తున్నారు. .
- Warangal Airport: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు భూ సేకరణ ప్రక్రియ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు అవసరమైన 253 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేస్తూ నవంబర్ 17న ఉత్తర్వులు జారీ చేయగా.. రైతులు భూమి కావాలని పట్టుబడుతున్నారు.
- Karimnagar Crime: కరీంనగర్ లో దొంగలు రెచ్చిపోయారు... తాళాలు వెసి ఉన్న ఇంటితో పాటు ఆలయంలో చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు నిఘా పెట్టగా అంతరాష్ట్ర గజదొంగ పట్టుబడ్డాడు. 20కిపైగా కేసుల్లో నిందితుడని పోలీసులు తేల్చారు.