తెలుగు న్యూస్  /  ఫోటో  /  Champions Trophy India Schedule: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‍ల షెడ్యూల్ ఇదే.. పాక్‍తో పోరు ఎప్పడంటే.. లైవ్ ఎక్కడ?

Champions Trophy India Schedule: ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్‍ల షెడ్యూల్ ఇదే.. పాక్‍తో పోరు ఎప్పడంటే.. లైవ్ ఎక్కడ?

24 December 2024, 18:33 IST

Champions Trophy 2025 India Schedule: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. గ్రూప్ దశలో భారత్ మ్యాచ్‍లు ఏ తేదీల్లో ఉన్నాయో ఇక్కడ చూడండి.

  • Champions Trophy 2025 India Schedule: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. గ్రూప్ దశలో భారత్ మ్యాచ్‍లు ఏ తేదీల్లో ఉన్నాయో ఇక్కడ చూడండి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనుంది. పూర్తి షెడ్యూల్‍ను ఐసీసీ నేడు వెల్లడించింది. గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా మ్యాచ్‍ల షెడ్యూల్‍ను ఇక్కడ తెలుసుకోండి. 
(1 / 6)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9వ తేదీ వరకు జరగనుంది. పూర్తి షెడ్యూల్‍ను ఐసీసీ నేడు వెల్లడించింది. గ్రూప్-ఏలో ఉన్న టీమిండియా మ్యాచ్‍ల షెడ్యూల్‍ను ఇక్కడ తెలుసుకోండి. (BCCI)
పాకిస్థాన్, యూఏఈ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. టీమిండియా తన మ్యాచ్‍లన్నీ దుబాయ్ వేదికగా ఆడుతుంది. ఇండియా లేని మ్యాచ్‍లు పాక్‍లోనే జరుగుతాయి. 
(2 / 6)
పాకిస్థాన్, యూఏఈ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. టీమిండియా తన మ్యాచ్‍లన్నీ దుబాయ్ వేదికగా ఆడుతుంది. ఇండియా లేని మ్యాచ్‍లు పాక్‍లోనే జరుగుతాయి. (AFP)
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన తొలి మ్యాచ్‍ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‍తో భారత్ ఆడనుంది. 
(3 / 6)
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన తొలి మ్యాచ్‍ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‍తో భారత్ ఆడనుంది. (PTI)
ఈ టోర్నీలో టీమిండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23వ తేదీన జరగనుంది. దుబాయి స్టేడియం వేదికగా ఈ హైవోల్టేజ్ పోరు సాగనుంది. 
(4 / 6)
ఈ టోర్నీలో టీమిండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23వ తేదీన జరగనుంది. దుబాయి స్టేడియం వేదికగా ఈ హైవోల్టేజ్ పోరు సాగనుంది. 
న్యూజిలాండ్‍తో మార్చి 2న భారత్ తలపడనుంది. ఇండియా ఆడే అన్ని మ్యాచ్‍లు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రసారం అవుతాయి. చాంపియన్ ట్రోఫీ 2025 మ్యాచ్‍లు స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానెళ్లలో టెలికాస్ట్ అవుతుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో మ్యాచ్‍ల లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
(5 / 6)
న్యూజిలాండ్‍తో మార్చి 2న భారత్ తలపడనుంది. ఇండియా ఆడే అన్ని మ్యాచ్‍లు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రసారం అవుతాయి. చాంపియన్ ట్రోఫీ 2025 మ్యాచ్‍లు స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానెళ్లలో టెలికాస్ట్ అవుతుంది. డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో మ్యాచ్‍ల లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ ఉన్నాయి. గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయి. మార్చి 4,5 తేదీల్లో సెమీఫైనల్స్, మార్చి 9న ఫైనల్ జరగనుంది. 
(6 / 6)
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్-ఏలో భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ ఉన్నాయి. గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయి. మార్చి 4,5 తేదీల్లో సెమీఫైనల్స్, మార్చి 9న ఫైనల్ జరగనుంది. 

    ఆర్టికల్ షేర్ చేయండి