తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pakistan Threatens Nuclear War : ‘మా దగ్గర ఆటం బాంబు ఉంది’- భారత్​కు పాక్​ హెచ్చరిక!

Pakistan threatens nuclear war : ‘మా దగ్గర ఆటం బాంబు ఉంది’- భారత్​కు పాక్​ హెచ్చరిక!

18 December 2022, 6:48 IST

google News
  • Pakistan threatens nuclear war : ‘మా దగ్గర ఆటం బాంబు ఉంది,’ అంటూ ఇండియాకు హెచ్చరికలు జారీ చేశారు పాకిస్థానీ నేత. బిలావల్​ భుట్టో వ్యవహారం నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్​కు పాక్​ హెచ్చరికలు
భారత్​కు పాక్​ హెచ్చరికలు

భారత్​కు పాక్​ హెచ్చరికలు

Pakistan threatens nuclear war : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పాకిస్థాన్​ విదేశాంగమంత్రి బిలావల్​ భుట్టో జర్దారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. బిలావల్​పై భారతీయులు తీవ్రస్థాయిలో మండిపడుతుండగా.. ఆయనకు పాకిస్థానీలు మద్దతుగా నిలిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీ నేత షాజియా మేరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద ఆటం బాంబు ఉందని, ఇండియా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు!

"పాకిస్థాన్​ దగ్గర ఆటం బాంబు ఉందన్న విషయాన్ని ఇండియా మార్చిపోకూడదు. మోదీ ప్రభుత్వం పోరాటం చేస్తే.. అందుకు తగ్గట్టుగానే జవాబు చెబుతాము. పాకిస్థాన్​ వద్ద అణ్వాయుధ శక్తి ఉంది. మేము నిశ్శబ్ధంగా ఉండము. ఏ విధంగా జవాబు చెప్పాలో పాకిస్థాన్​కు తెలుసు. పాకిస్థాన్​పై పదేపదే ఆరోపణలు చేస్తే.. మేము నిశ్శబ్ధంగా ఉండలేము," అని ఓ మీడియా సమావేశంలో హెచ్చరికలు చేశారు షాజియా మేరీ.

బిలావల్​ వివాదాస్పద వ్యాఖ్యలు..

Bilawal Bhutto comment on Modi : యూఎన్​ వేదికగా పాకిస్థాన్​పై ఇటీవలే తీవ్రస్థాయిలో మండిపడ్డారు భారత వీదేశాంగశాఖ మంత్రి జైశంకర్​. ఉగ్రవాదాన్ని ఆ దేశం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇతరులను బాధపెట్టే చర్యలను మానుకుని, పొరుగు దేశాలతో మంచిగా ప్రవర్తించాలని హితవు పలికారు. ఉగ్రవాదాన్ని ఇండియా ప్రేరేపిస్తోందని ఓ పాక్​ జర్నలిస్ట్​ ఆరోపించిన నేపథ్యంలో జైశంకర్​ ఈ విధంగా స్పందించారు.

"ఈ ప్రశ్నని మీరు తప్పుడు మంత్రిని అడుగుతున్నారు. మీరు అడగాల్సింది పాకిస్థాన్​ మంత్రిని. ఇంకెంత కాలం ఉగ్రవాదాన్ని వ్యాపింప చేస్తారో పాకిస్థాన్​ మంత్రులే చెప్పాలి. ఒసామా బిన్​ లాడెన్​కు ఆశ్రయం ఇచ్చిన దేశం మీది," అని అన్నారు.

Bilawal Bhutto Modi comments : మరోవైపు.. యూఎన్​ వేదికగా పాకిస్థాన్​ విదేశాంగమంత్రి సైతం భారత్​పై మండిపడ్డారు. ఈ క్రమంలోనే మోదీ, ఆర్​ఎస్​ఎస్​పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

"మీకో విషయం చెప్పాలి. ఒసామా బిన్​ లాడెన్​ చచ్చిపోయాడు. కానీ 'బుచ్చర్​ ఆఫ్​ గుజరాత్​' బతికే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇండియాకు ప్రధాని కూడా అయ్యారు. ఈ ప్రధాని ఆర్​ఎస్​ఎస్​ మనిషి. ఈ విదేశాంగమంత్రి ఆర్​ఎస్​ఎస్​ మనిషి. ఆర్​ఎస్​ఎస్​ అంటే ఏంటి? హిట్లర్​ నుంచి స్ఫూర్తిపొందిందే ఈ ఆర్​ఎస్​ఎస్​," అని వ్యాఖ్యలు చేశారు బిలావల్​ భుట్టో.

India Pakistan nuclear war : పాక్​ విదేశాంగమంత్రి వ్యాఖ్యలను ఇండియా తిప్పికొట్టింది. ‘పాకిస్థాన్​ మరింత దిగజారిపోయింది’ అని విమర్శించింది. బిలావల్​ భుట్టో మాటలకు వ్యతిరేకంగా ఇండియాలో నిరసనలు చెలరేగాయి. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది బీజేపీ. ఆయన దిష్టిబొమ్మలను తగలబెట్టింది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం