తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lok Sabha Speaker: ఓం బిర్లా వర్సెస్​ కే సురేశ్​- మూడోసారి లోక్​సభ స్పీకర్​ కోసం ఎన్నిక!

Lok Sabha speaker: ఓం బిర్లా వర్సెస్​ కే సురేశ్​- మూడోసారి లోక్​సభ స్పీకర్​ కోసం ఎన్నిక!

Sharath Chitturi HT Telugu

26 June 2024, 11:59 IST

google News
  • Lok Sabha speaker elections: స్వతంత్ర భారత దేశంలో మూడోసారి.. లోక్​సభ స్పీకర్​ పదవికి ఎన్నిక జరగనుంది! బీజేపీ, కాంగ్రెస్​లు తమ తమ అభ్యర్థులను నిలబెట్టాయి.

లోక్​సభ స్పీకర్​ పదవికి నామినేషన్​ వేసిన ఓం బిర్లా..
లోక్​సభ స్పీకర్​ పదవికి నామినేషన్​ వేసిన ఓం బిర్లా.. (PTI)

లోక్​సభ స్పీకర్​ పదవికి నామినేషన్​ వేసిన ఓం బిర్లా..

స్వతంత్య్ర భారత దేశ చరిత్రలో లోక్‌సభ స్పీకర్ పదవి కోసం మూడోసారి ఎన్నిక జరగనుంది. 18వ లోక్​సభ స్పీకర్​ పదవి కోసం బీజేపీ నుంచి ఓం బిర్లా, కాంగ్రెస్​ నుంచి కే సురేశ్​ పోటీపడనున్నారు.

బీజేపీ వర్సెస్​ కాంగ్రెస్​..

బీజేపీ ఎంపీ, గత లోక్​సభలో స్పీకర్​గా ఉన్న ఓం బిర్లా.. ఈసారి కూడా ఆ బాధ్యతలు చేపట్టనున్నట్టు, అది ఏకగ్రీవంగా జరగనున్నట్టు అందరు భావించారు. కానీ.. కాంగ్రెస్​ పార్టీ.. కే సురేశ్​ని స్పీకర్​ పదవికి నిల్చోబెట్టింది.

మంగళవారం మధ్యాహ్నం నాటికి స్పీకర్​ అభ్యర్థి నామినేషన్​ ప్రక్రియ ముగిసింది. ఓం బిర్లా, కే సురేశ్​లు నామినేషన్​ దాఖలు చేశారు. లోక్​సభ స్పీకర్​ పదవికి బుధవారం ఎన్నిక జరగనుంది.

రాజస్థాన్​ కోటా నుంచి బీజేపీ ఎంపిగా ఉన్నారు ఓం బిర్లా. ఇక కేరళ మావేలికర నుంచి 8సార్లు గెలిచారు కే. సురేశ్​. ఈయన్ని ప్రోటెం స్పీకర్​గా ఎంపిక చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. కానీ భర్తృహరికి ఆ పదవి ఇచ్చింది. ఈ విషయంపైనా ఇరుపక్షాల మధ్య విభేదాలు కనిపించాయి.

అయితే.. లోక్​సభలో ఎన్​డీఏకి మద్దతు ఎక్కువగా ఉంది కాబట్టి.. ఓం బిర్లా గెలుపు ఖాయం! ఎన్​డీఏ కూటమి దగ్గర 293 ఓట్లు, ఇండియా కూటమి వద్ద 232 ఓట్లు ఉన్నాయి. ఫలితంగా.. బుధవారం జరిగే ఎన్నికలో గెలిచి.. వరుసగా రెండోసారి లోక్​సభ స్పీకర్​ అయిన రెండో వ్యక్తిగా నిలుస్తారు ఓం బిర్లా.

ఇదీ చూడండి:- Lok Sabha Speaker : ఓం బిర్లాకే లోక్​సభ స్పీకర్​ బాధ్యతలు! మరి పురంధేశ్వరి?

కుదరని సయోధ్య..

వాస్తవానికి అధికార-విపక్షాల మధ్య లోక్​సభ స్పీకర్​ విషయంపై చర్చలు జరిగాయి. ఎన్​డీఏ నిలబెట్టే స్పీకర్​ అభ్యర్థికి మద్దతిస్తామని ఇండియా కూటమి ఒప్పుకుంది. బదులుగా డిప్యూటీ స్పీకర్​ని తాము నిర్ణయిస్తామని డిమాండ్​ చేసింది. ఈ విషయంలో ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదరలేదని సమాచారం. చివరికి.. అనూహ్యంగా కే సురేశ్​ని స్పీకర్​ రేసులో నిలిపింది కాంగ్రెస్​.

‘ప్రభుత్వ పాలనలో విపక్షం మద్దతివ్వాలని, నిర్మాణాత్మక బాధ్యత చేపట్టలని ప్రధానమంత్రి అన్నారు. మేము స్పీకర్​ని సపోర్ట్​ చేస్తామని, కానీ డిప్యూటీ స్పీకర్​ పదవి మాకు కావాలని విపక్షం అడిగింది. స్పీకర్​ విషయంలో మద్దతు కోసం రాజ్​నాథ్​ సింగ్​ మల్లిఖార్జు ఖర్గేకి ఫోన్​ చేశారు. డిప్యూటీ స్పీకర్​ గురించి అడిగితే.. మళ్లీ ఫోన్​ చేస్తానని, ఇంకా చేయలేదు. ఇది మ నేతకు అవమానం. మోదీకి నిర్మాణాత్మక సహకారం అక్కర్లేదు" అని రాహుల్​ గాంధీ అన్నారు.

తదుపరి వ్యాసం