తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India-china : లద్దాఖ్‌లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ దాదాపు పూర్తి.. ఇకపై పెట్రోలింగ్

India-China : లద్దాఖ్‌లో భారత్, చైనా బలగాల ఉపసంహరణ దాదాపు పూర్తి.. ఇకపై పెట్రోలింగ్

Anand Sai HT Telugu

30 October 2024, 6:42 IST

google News
    • India-China : తూర్పు లద్దాఖ్‌లోని దేప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో భారత, చైనా దళాలు పూర్తిగా వైదొలగడం దాదాపు పూర్తి అయింది. ఇక పెట్రోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భారత్-చైనా బలగాల ఉపసంహరణ
భారత్-చైనా బలగాల ఉపసంహరణ (PTI)

భారత్-చైనా బలగాల ఉపసంహరణ

తూర్పు లద్దాఖ్‌లోని డెప్సాంగ్, డెమ్చోక్ నుండి భారతీయ, చైనీస్ సైన్యాల తొలగింపు దాదాపు ముగిసింది. రెండు వైపులా ఏకకాలంలో దళాలు ఉపసంహరించుకున్నాయి. మౌలిక సదుపాయాలు, ఇతర పరికరాలను ఆ ప్రాంతం నుంచి నిర్దిష్ట దూరానికి తీసుకెళ్లారు. పరస్పరం అంగీకరించిన దూరానికి పట్టుకెళ్లారు.

ఈ ప్రక్రియలో భాగంగా ఇండియన్ ఆర్మీ, చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వెంబడి ఉన్న రెండు ఫ్లాష్‌పాయింట్‌ల నుండి మోహరించిన దళాలను, పరికరాలను వెనక్కి లాగాయి. తాత్కాలిక నిర్మాణాలను కూల్చివేశాయి. 'బలగాల ఉపసంహరణ ముగిసింది. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి అక్టోబర్ 21 న భారతదేశం, చైనా చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా జరుగుతోంది.' అని ఓ అధికారి తెలిపారు.

డెప్సాంగ్, డెమ్చోక్‌లో బలగాల ఉపసంహరణ తర్వాత రెండు వైపులా సమన్వయంతో పెట్రోలింగ్‌ను సులభతరం చేస్తుంది. 'ఇది ఎటువంటి ముఖాముఖి ఇబ్బందులు లేవని చెబుతుంది. ఈ ప్రాంతంలో శాంతిని తీసుకొచ్చేందుకు ఇరుపక్షాలు ఒక మార్గాన్ని రూపొందించాయి.' అని మాజీ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా (రిటైర్డ్) అన్నారు.

అక్టోబర్ 31 నాటికి రెండు సైన్యాలు తూర్పు లద్దాఖ్‌లోని ప్రాంతాలపై పెట్రోలింగ్ ప్రారంభిస్తాయి. ఇది ఏప్రిల్ 2020కి ముందు ఉన్న పరిస్థితికి తీసుకెళ్తుంది. చైనా ఆర్మీ ముందుకు వచ్చిన ప్రాంతాల్లో భారత సైన్యం తన పెట్రోలింగ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుంది.

లద్దాఖ్‌లోని చివరి రెండు ఫ్లాష్‌పాయింట్‌లైన డెప్సాంగ్, డెమ్చోక్ ప్రతిష్టంభనను పరిష్కరించడానికి భారతదేశం, చైనా అక్టోబర్ 21న ఒప్పందాన్ని ప్రకటించాయి. తర్వాత ఇరు దేశాలు ఒప్పందంపై సంతకం చేశాయి. పెట్రోలింగ్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంగేజ్‌మెంట్ ఒప్పందం కేవలం డెప్సాంగ్, డెమ్చోక్ మాత్రమే కవర్ చేస్తుంది. బఫర్ జోన్‌లు అని పిలిచే ఇతర ప్రాంతాలపై రెండు దేశాలు వేర్వేరు స్థాయిలలో చర్చలు కొనసాగిస్తాయి.

ఘర్షణ ప్రాంతాల నుండి బలగాల ఉపసంహరణ అనేది సరిహద్దు ఉద్రిక్తతలను చల్లబరచడానికి మొదటి అడుగు. దీర్ఘకాలిక సంఘర్షణను తగ్గించేందుకు ఇది సాధ్యమవుతుంది. రెండు సైన్యాలు ఇప్పటికీ పదివేల మంది సైనికులను కలిగి ఉన్నాయి. అధునాతన ఆయుధాలను ఇక్కడ మోహరించారు. ఇప్పుడు వాటిని ఉపసంహరించుకున్నారు.

2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇందులో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. అటు చైనా సైనికులు కూడా మృతిచెందారు. ఆ తర్వాత ఇరు దేశాలు ఎల్ఏసీ వెంట సైన్యాన్ని మోహరించాయి. తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పెట్రోలింగ్ ఒప్పందం జరిగింది.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం