తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Techie Suicide: భార్య వేధింపులతో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య; 24 పేజీల డెత్ నోట్

Bengaluru techie suicide: భార్య వేధింపులతో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య; 24 పేజీల డెత్ నోట్

Sudarshan V HT Telugu

10 December 2024, 18:46 IST

google News
  • Bengaluru techie suicide: బెంగళూరులో ఒక టెక్కీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ ప్రైవేట్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు 24 పేజీల డెత్ నోట్ రాసి అందులో తన భార్య వేధింపుల గురించి వివరించాడు.

భార్య వేధింపులతో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య
భార్య వేధింపులతో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య

భార్య వేధింపులతో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య

Bengaluru techie suicide: ఉత్తరప్రదేశ్ కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి బెంగళూరులోని మారతహళ్లిలోని తన నివాసంలో సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న అతుల్ సుభాష్ అనే వ్యక్తి తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులను వివరిస్తూ 24 పేజీల డెత్ నోట్ ను రాసినట్లు పోలీసులు తెలిపారు.

ఒంటరిగా ఉంటూ..

ఈ ఘటన మంజునాథ్ లేఅవుట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యతో విడిపోయాక ఒంటరిగా ఉంటున్న సుభాష్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. అతని భార్య ఇటీవల ఉత్తరప్రదేశ్ లో అతనిపై గృహహింస కేసు పెట్టింది. ఇది అతని మానసిక క్షోభకు కారణమైంది. దాంతో, భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులను వివరిస్తూ,అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

'న్యాయం జరగాలి' అనే ప్లకార్డు

ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత, సుభాష్ 24 పేజీల డెత్ నోట్ ను రాశాడు. అందులో తనకు న్యాయం జరగాలని కోరాడు. అలాగే, తన ఇంట్లో 'న్యాయం జరగాలి' అనే ప్లకార్డును వేలాడదీశారు. తన డెత్ నోట్ ను సుభాష్ పలువురికి ఈమెయిల్ చేసి, తనకు అనుబంధంగా ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ వాట్సాప్ (whatsapp) గ్రూప్ లో షేర్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా సుభాష్ తన డెత్ నోట్, వాహన తాళాలు, పూర్తయిన, పెండింగ్ లో ఉన్న పనుల జాబితాతో సహా కీలక వివరాలను అల్మారాపై అతికించాడు.

భార్యపై కేసు నమోదు

ఇరుగుపొరుగువారి ఫిర్యాదు మేరకు సుభాష్ భార్య, ఆమె బంధువులపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు ధృవీకరించారు. ఆయన మృతికి గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.

గమనిక: ఆత్మహత్యల గురించి చర్చించడం కొంతమందికి ప్రేరేపిస్తుంది. అయినప్పటికీ ఆత్మహత్యలను నివారించవచ్చు. భారతదేశంలో కొన్ని ప్రధాన ఆత్మహత్య నివారణ హెల్ప్ లైన్ నంబర్లు సుమైత్రి (ఢిల్లీ కేంద్రంగా) నుండి 011-23389090 మరియు స్నేహ ఫౌండేషన్ (చెన్నై కేంద్రంగా) నుండి 044-24640050.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం