తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Today Gold Rate September 4th : నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. మీ నగరంలో ఎంత ఉందంటే?

Today Gold Rate September 4th : నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. మీ నగరంలో ఎంత ఉందంటే?

Anand Sai HT Telugu

04 September 2024, 5:41 IST

google News
    • Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు సైతం బుధవారం దిగొచ్చాయి. హైదరాబాద్, విజయవాడలాంటి నగరాల్లో ఎలా ఉన్నాయో చూద్దాం..
ఈరోజు బంగారం ధరలు
ఈరోజు బంగారం ధరలు

ఈరోజు బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 66,690కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 66,700గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,66,900గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,669గా ఉంది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 72,760గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 72,770గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,27,600గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,276గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,840గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,910గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,690 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,760గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,690గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,760గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,690గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,760గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,690గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,760గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,740గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,810గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,690గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,760గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,590గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 85,900గా కొనసాగుతోంది. మంగళవారం ఈ ధర రూ. 86,000గా ఉండేది.

హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 90,800 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 85,900.. బెంగళూరులో రూ. 82,900గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు బుధవారం తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 170 తగ్గి రూ. 24,770కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 24,940గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,770గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

తదుపరి వ్యాసం