తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఇరాన్​పై అమెరికా దాడి- ఈ రోజు స్టాక్​ మార్కెట్​లకు అతి భారీ నష్టాలు తప్పవా?

ఇరాన్​పై అమెరికా దాడి- ఈ రోజు స్టాక్​ మార్కెట్​లకు అతి భారీ నష్టాలు తప్పవా?

Sharath Chitturi HT Telugu

Published Jun 23, 2025 08:15 AM IST

google News
  • ఇరాన్​పై అమెరికా దాడి చేయడంతో అంతర్జాతీయ స్టాక్​ మార్కెట్​లు పతనమయ్యాయి. మరి ఇండియన్​ స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి? గిఫ్ట్​ నిఫ్టీ ఏం సూచిస్తోంది? పూర్తి వివరాలు..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1046 పాయింట్లు పెరిగి 82,408 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 319 పాయింట్లు వృద్ధిచెంది 25,112 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 675 పాయింట్లు పెరిగి 56,253 వద్దకు చేరింది.


మారిన పరిస్థితులు- మదుపర్లలో టెన్షన్​ టెన్షన్​!

ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు ఉన్న విషయం తెలిసిందే. కానీ ఆదివారం అమెరికా కూడా ఇరాన్​పై దాడులు చేయడంతో ప్రపంచ దేశాలు ఉల్లికిపడ్డాయి. మూడు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చాయి. అమెరికా దాడులతో ఇరాన్​.. స్టైట్​ ఆఫ్​ హార్ముజ్​ని మూసివేస్తామని హెచ్చరించింది. ఈ జలసంధి ప్రపంచ ముడి చమురు సరఫరాకు అత్యంత కీలకమైనది. ఇరాన్​ ఈ పనిచేస్తే ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతాయని మదుపర్లలో భయం మొదలైంది. ముడి చమురు ధరలు పెరగడం స్టాక్​ మార్కెట్​లకు మంచిది కాదు. ఈ పూర్తి పరిణామాలతో అంతర్జాతీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాలవైపు అడుగులు వేస్తున్నాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 7,704.37 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,657.7 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 150 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 25,200 లెవల్స్​ పైన క్లోజ్​ అయితే ప్రస్తుత కన్సాలిడేషన్​ బ్రేక్​ అయినట్టు పరిగణించవచ్చు. అక్కడి నుంచి 25,600- 25,800 లెవల్స్​ వరకు వెళ్లొచ్చు. కిందివైపు 24,700-24,400 సపోర్ట్​లుగా ఉన్నాయి,” అని రెలిగేర్​ బ్రోకింగ్​ లిమిటెడ్​ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ అజిత్​ మిశ్రా తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.08 శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.22శాతం పతనమైంది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.51 శాతం పడింది. కాగా యూఎస్​ ఫ్యూచర్స్​ నష్టాల్లో ట్రేడ్​ అవుతున్నాయి.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధరలు..

అంతర్జాతీయ అనిశ్చితి కారమంగా బ్రెంట్​ క్రూడ్​ 2.49శాతం పెరిగి బ్యారెల్​కు 78.92 డాలర్లకు చేరింది. జనవరి తర్వాత ఇదే అత్యధికం!

స్టాక్స్​ టు బై..

కేఫిన్​ టెక్నాలజీస్​- బై రూ. 1278.4, స్టాప్​ లాస్​ రూ. 1230, టార్గెట్​ రూ. 1360

గో డిజిట్​ జనరల్​ ఇన్సూరెన్స్​- బై రూ. 356.2, స్టాప్​ లాస్​ రూ. 344, టార్గెట్​ రూ. 380

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​- బై రూ. 1360, స్టాప్​ లాస్​ రూ. 1320, టార్గెట్​ రూ. 1410

టాటా మోటార్స్​- బై రూ. 676, స్టాప్​ లాస్​ రూ. 655, టార్గెట్​ రూ. 700

నేషనల్​ అల్యుమీనియ్​ కంపెనీ- బై రూ. 184, స్టాప్​ లాస్​ రూ. 178, టార్గెట్​ రూ. 192

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)