LIVE UPDATES

AP Ministers: ఫైళ్ల క్లియరెన్స్లో ఫరూఖ్ టాప్… సుభాష్ లాస్ట్, క్యాబినెట్లోపేర్లు చదివిని సీఎం చంద్రబాబు
Andhra Pradesh News Live February 6, 2025: AP Ministers: ఫైళ్ల క్లియరెన్స్లో ఫరూఖ్ టాప్… సుభాష్ లాస్ట్, క్యాబినెట్లోపేర్లు చదివిని సీఎం చంద్రబాబు
Updated Feb 06, 2025 07:54 PM IST
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Ministers: ఫైళ్ల క్లియరెన్స్లో ఫరూఖ్ టాప్… సుభాష్ లాస్ట్, క్యాబినెట్లోపేర్లు చదివిని సీఎం చంద్రబాబు
- AP Ministers: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ప్రతి నెలలో రెండు సార్లు ఖచ్చితంగా భేటీ అవుతోంది. అవసరమైతే అదనపు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం తాజా భేటీలో ఫైల్స్ క్లియరెన్స్పై మంత్రుల పనితీరును వివరించగా ఫరూక్ అందిరి కంటే ముందున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Amaravati : రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ఈసీ క్లియరెన్స్.. కండిషన్స్ అప్లై!
- Amaravati : అమరావతి పనులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పనులకు క్లియరెన్స్ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. సీఆర్డీఏ అధికారులు ఈసీకి లేఖ రాయగా.. ఎన్నికలు పూర్తయ్యాకే టెండర్లు ఫైనలైజ్ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Cabinet Decisions : బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Andhra Pradesh Cabinet Decisions: ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కేపాసిటీ బిల్డింగ్, పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణ ప్రతిపాదనలపై కేబినెట్ లో చర్చ జరిగింది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Annamayya District : టాస్క్ ఫోర్స్ పోలీసుల భారీ ఆపరేషన్ - రూ. 4.20 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
- అన్నమయ్య జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ ఎర్ర చందనం ఆపరేషన్ చేపట్టారు. ఏకంగా రూ.4.20 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది అంతరాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Jagan 2.O : జగన్ 2.O కామెంట్స్ వెనక వ్యూహం ఏంటీ.. వైసీపీ కార్యకర్తల కోసం ఏం చేయబోతున్నారు?
- Jagan 2.O : ఏ రాజకీయ పార్టీకి అయినా వెన్నెముక కార్యకర్తలు. అధికారంలో ఉన్నప్పుడు వారిని విస్మరించిన పార్టీలు ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఓటమి తర్వాత ఈ విషయాన్ని గ్రహించిన జగన్.. తాజాగా 2.O కామెంట్స్ చేశారు. దీంతో జగన్ కేడర్ కోసం చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: AP EHS Services: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్… తెలంగాణలో కూడా వైద్య సేవలు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- AP EHS Services: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లోనూ వారు చికిత్స తీసుకునేందుకు అనుమతించింది. ఈమేరకు తెలంగాణలో రిఫరల్ ఆసుపత్రులను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవోను ఆదేశించింది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Amaravati Works : రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు బ్రేక్.. కారణాలు ఇవే!
- Amaravati Works : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అమరావతిపై ఫోకస్ పెట్టింది. రాజధాని పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసింది. కానీ అంతలోనే బ్రేక్ పడింది. అందుకు కారణం ఎమ్మెల్సీ ఎన్నికలు. అవును.. ఎన్నికల కోడ్ అమరావతి పనులకు అడ్డింకిగా మారింది. దీనిపై సీఆర్డీఏ ఈసీకి లేఖ రాసింది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Jagan On Saireddy: విలువలు, వ్యక్తిత్వం ఉండాలి.. సాయిరెడ్డి, పార్టీ వీడిన ఎంపీలపై జగన్ వ్యాఖ్యలు
- Jagan On Saireddy: రాజకీయాల్లో ఉన్న వారికి విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత ముఖ్యమని, కష్టాలు ఎల్లకాలం ఉండవని, ప్రజాస్వామ్యంలో ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉండగలరని గుర్తుంచుకోవాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. సాయిరెడ్డి పార్టీ పార్టీని వీడటం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: APSWREIS Admissions: ఏపీ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్
- APSWREIS Admissions: ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి, జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirupati Crime : విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
- Tirupati Crime : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే.. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని నిలదీశారు. గ్రామస్తులతో కలిసి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Ys Jagan On CBN: సూపర్ సిక్స్ ఎక్కడ.. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని రుజువైందన్న వైఎస్ జగన్
- Ys Jagan On CBN: చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్టేనని చెప్పినా జనం వినలేదని, బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అంటూ నిండా ముంచారని, బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అని తొమ్మిది నెలల్లో రుజువైందని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kanakadurga Temple : దళారులతో దోస్తీ.. వీఐపీ దర్శనాల దందా.. ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్!
- Kanakadurga Temple : అమ్మవారి దర్శనం పేరుతో దళారులు దందా నడిపించారు. ఈ దందాలో ఆలయ ఉద్యోగులు భాగం అయ్యారు. ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఇద్దరు ఆలయ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఈ ఇష్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kumbhamela Trains: రాయలసీమ జిల్లాల మీదుగా మహా కుంభ మేళాకు నాలుగు స్పెషల్ రైళ్లు
- Kumbhamela Trains: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు, యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు రాయలసీమ జిల్లాల మీదుగా స్పెషల్ రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Minor Girl And Boy: శ్రీసత్యసాయి జిల్లాలో ఘోరం...బాలికపై బాలుడు అత్యాచారం, గర్భం దాల్చడంతో వెలుగులోకొచ్చిన ఘటన
- Minor Girl And Boy: శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలికపై బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తోటి విద్యార్థులుగాని, కుటుంబ సభ్యులు ఆమె గర్భం దాల్చడాన్ని గుర్తించలేకపోయారు.
ఆంధ్ర ప్రదేశ్ News Live: Lokesh In Delhi: ఢిల్లీలో నారా లోకేష్ బిజీబిజీ.. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు, జోరుగా ఊహాగానాలు
- Lokesh In Delhi: మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మంత్రుల ఢిల్లీ పర్యటనలు సాధారణమే అయినా ఢిల్లీలో కీలకమైన నేతలతో నారా లోకేష్ భేటీ అవుతున్నారు. వారసత్వాలపై నమ్మకం లేదని అవకాశాలను అందిపుచ్చు కోవాల్సిందేనని చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో లోకేష్ దూకుడు పెంచినట్టు ప్రచారమవుతోంది.